కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా కొంగువ. శివా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న గ్రాండ్గా విడుదల కాబోతోంది .అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను నిర్మాత జ్ఞానవేల్ రివిల్ చేశారు. దీంతో ఆయన చేసిన పలు కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక  ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. కంగువ పార్ట్ వన్ పార్ట్ టు కోసం కథ రాసం. కొన్ని ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులు పార్ట్ 2 ను ఫాలో అయ్యేలా చేస్తాయి. పార్ట్ వన్ కోసం దాదాపుగా 185 రోజులు షూటింగ్ చేశాం.

 2025 చివరలో లేదా 2026లో ఈ సినిమా నో సెట్స్ పైకి తీసుకువెళ్తాము. 2027 వేసవికాలంలో రిలీజ్ చేస్తాము అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఒకేసారి కంగువా పార్ట్ వన్ టు లపై అప్డేట్ రావడంతో సూర్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘కంగువ’ తొలి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్లు జ్ఞానవేల్ తెలిపారు. “‘కంగువ’ పార్ట్ 1ను అద్భుతంగా తీస్తే, పార్ట్ 2 మీద మరిన్ని అంచనాలు పెరుగుతాయి. ఈ సినిమా విషయంలోనూ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాం. మొదటి భాగాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నాం. ఈ మూవీ చివరలో ప్రేక్షకులను కట్టిపడేసే సీన్లు ఉంటాయి. ఈ సన్నివేశాలు సీక్వెల్ పై భారీగా

 అంచనాలు పెంచుతాయి. సెకెండ్ పార్ట్ ఆటోమేటిక్ గా మంచి సక్సెస్ అందుకుంటుంది” అని నిర్మాత జ్ఞానవేల్ రాజా తెలిపారు. మొత్తంగా ‘కంగువ’ సినిమా విషయంలో మేకర్స్ వేస్తున్న ప్లాన్ అదుర్స్ అనిపించేలా ఉంది. అయితే,తొలి భాగం విడుదలయ్యాకే రెండో భాగం ఎలా ఉంటుంది? అనేది ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కంగువా. తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సూర్య లుక్, టీజర్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశాయి.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: