టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తను ఏ సినిమా చేసిన కూడా అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ఎంతో పద్ధతిగా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ఎన్నో సినిమాల్లో నటించి భారీ విజయాన్ని అందుకుంది సాయి పల్లవి. ఇకపోతే సాయి పల్లవి వచ్చిన ప్రతి ఆఫర్ ను ఆక్సెప్ట్ చెయ్యదు. తన దగ్గరికి వచ్చిన కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండి అసభ్యకరమైన కంటెంట్ లేకుండా ఉంటే మాత్రమే ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ వేస్తుంది. పద్ధతిగా ఉండే పాత్రలు మాత్రమే చేయడానికి ఇష్టపడుతుంది .అందుకే సాయి

 పల్లవిని ఆరాధించే వారిలో కోట్లాదిమంది ఉన్నారు. ఇలా సాయి పల్లవిని అభిమానించే వారు కోట్లల్లో ఉన్నారు అంటే దానికి కారణం ఆమె సింప్లిసిటీ. ఎంత స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఎంతో అనుకూలంగా ఉంటుంది సాయి పల్లవి. ఇకపోతే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో తండేల్ అనే సినిమా చేస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ ని కూడా ఎంటర్ చేస్తోంది సాయి పల్లవి. హిందీలో రామాయన్ లో సీత పాత్రలో కనిపించబోతోంది. ఇదిలా ఉంటే  ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా తాను ఎలాంటి పాత్రలు వస్తే చేయాలనుకుంటుంది అన్న విషయంపై క్లారిటీ

 ఇచ్చింది. 'ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేస్తే బోరింగ్‌గా ఉంటుంది. అన్ని రకాల పాత్రలు చేసినప్పుడే పరిపూర్ణమైన నటిగా మిగలగలం. కొంతవరకూ నేను లక్కీ. చేసిన సినిమాలన్నింటిలో 'కథానాయిక' అనదగ్గ పాత్రలే చేశాను. చేసినవన్నీ మంచి కథలే. నటిగానే కాక, నాట్యతారగా కూడా నాకవి గుర్తింపునిచ్చాయి. కానీ ఇంకా నా ఆకలి తీరలేదు. మంచి పాత్రలు చేయాలి. భిన్నమైన కేరక్టర్స్‌లో నటించాలి. ముఖ్యంగా కామెడీ నేపథ్యం ఉన్న సినిమాల్లో నటించాలని ఉంది. అందులో నేను కామెడీ చేయాలి. నిజానిక్కూడా ఇప్పటివరకూ ఆ తరహా పాత్రలు చేయలేదు. వస్తే మాత్రం వదిలేది లేదు.' అంటూ చెప్పుకొచ్చింది


మరింత సమాచారం తెలుసుకోండి: