సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఈమె ఒకప్పటి స్టార్ హీరోయిన్. అంతేకాదు మోడల్ కూడా. మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించిన నమ్రత ఆ తర్వాత సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకొని స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. 1998లో జబ్ ప్యార్ కిస్  హోత హై సినిమాతో బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించింది. అలా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా వెలుగొందింది.  ఈ సినిమా తర్వాత తనకే బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటించే అవకాశం వస్తున్న సమయంలో తెలుగులో మహేష్ బాబు వంశీ కాంబోలో వచ్చిన సినిమాలో

 హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ కి పరిచయమైంది నమ్రత. మొదటి సినిమా తోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆ సినిమాతో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత అంజి సినిమాలో నటించిన ఆమె  మహేష్ బాబుతో నటించిన మొదటి సినిమాతోనే ఆయనతో ప్రేమలో పడిపోయింది. ఆ తర్వాత మహేష్ తో పెళ్లి బంధం లోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు. తనకి చాలా సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ వాటన్నిటినీ రిజెక్ట్ చేసింది. హీరోయిన్ గా తన కెరీర్ ను పక్కన పెట్టేసి కుటుంబాన్ని చేసుకుంటుంది.

 అయితే ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న నమ్రతకు సంబంధించిన ఓ వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత.. ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రముఖ ఫ్యామిలీకి చెందిన ఓ యంగ్ హీరో సినిమాలో నమ్రత కీలక పాత్రలో నటించనుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు.. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో ఆమె కనిపించనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు వెల్ కమ్ బ్యాక్ మేడమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: