అక్కినేని వారసులుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అక్కినేని నాగచైతన్య అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే అక్కినేని నాగచైతన్య ఓ మాదిరిగా సినిమాలు చేస్తున్నప్పటికీ అఖిల్ కి మాత్రం గత కొన్ని ఏళ్లుగా బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆయన కెరియర్ లో చెప్పుకోదగ్గ ఒక్క హిట్టు సినిమా కూడా లేదు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఆ మధ్యలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ ఆ సక్సెస్ మొత్తం హీరోయిన్ ఖాతాలోకి వెళ్లిపోయింది. దాంతో ఎలాగైనా హెట్టు కొట్టాలి అని నానా విధాలుగా ప్రయత్నిస్తున్నాడు.

 అంతేకాదు తన తండ్రి నాగార్జున సైతం దానికి సంబంధించిన తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అఖిల్ కొత్త దర్శకుడు అనిల్ కుమార్ తో యు వి క్రియేషన్స్ లో ఒక సినిమా చేయబోతున్నట్లుగా ఎప్పటినుండో వార్తలు వినపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేసినట్లుగా సమాచారం వినబడుతుంది. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాకి సుజిత్ దగ్గర అసిస్టెంట్గా చేసిన అనిల్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. అసలు విషయానికి వస్తే..అఖిల్ చేతిలో మరో ఇంట్రెస్టింగ్ రూరల్ బ్యాక్ డ్రాప్లో సాగే

 కథ ఉన్నట్లు సమాచారం.ఈ మేరకు హీరో నాగార్జున కూడా తన తనయుడు అఖిల్‌ కోసం మంచి కథను వెతికి పట్టుకొచ్చాడంటా.ఈ క్రమంలోనే ఇటీవల కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణుకథ'ఫేమ్‌ డైరెక్టర్ మురళీ కిశోర్‌ తన రూరల్ బ్యాక్ డ్రాప్ కథతో నాగ్‌ను మెప్పించినట్లు సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఈ కథ చిత్తూరు నేపథ్యంలో సాగే ఓ రూరల్‌ డ్రామా కథగా ఉండనుందని..అయ్యగారు అఖిల్‌కు సరిగ్గా సరిపోయేలా కథనం ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌ పై నాగ్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఈ సినిమాని అక్కినేని సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: