టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో  ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల పెళ్లి చేసుకుని వివాహ బంధం లోకి అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ నటుడు జాకీ భగ్నాని ని ప్రేమ వివాహం చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇక వీళ్లిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. భారతీయుడు సినిమాతో దాదాపుగా మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ సినీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇకపోతే లోకనాయకుడు

 కమలహాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ హీరోయిన్గా కనిపించబోతోంది. అలాగే సిద్ధార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఈ సినిమా తో పాటు సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది రకుల్. సోషల్ మీడియాలో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్. తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ నూతన అభిమానులతో పంచుకుంటుంది. తన పర్సనల్ విషయాలతో పాటు తన హెల్త్ కి సంబంధించిన విషయాలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

ఐతే  తాజాగా సోషల్ మీడియాలో కొన్ని అందమైన ఫోటోలను పోస్ట్  చేసింది రకుల్ ప్రీత్ సింగ్ . ఇవి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఇందులో లెహంగాలో ఎంతో గ్లామరస్ గా కనిపించింది రకుల్. నటి ఫోటోలు చూసిన తర్వాత, నెటిజన్లు లైక్‌లు, కామెంట్‌లతో పోటెత్తారు. అంతేకాదు పెళ్లి తర్వాత రకుల్ అందం మరింత పెరిగిపోయిందని అభిమానులు కూడా అంటున్నారు. కాగా జులై 12న రిలీజ్ కానున్న భారతీయుడు 2 లో దిశా పాత్రలో రకుల్ కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: