టాలీవుడ్ యంగ్ హీరో రాజా తరుణ్ తన ప్రేయసి లావణ్య ల వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. రోజుకు ఒక విషయం బయటకు రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. రాజ్ తరుణ్ తనను ప్రేమించి సహజీవనం చేసి అబార్షన్ కూడా చేయించాడు అని ఆరోపిస్తోంది లావణ్య.  ఇక ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేసింది. ఇదే విషయంపై చాలా విషయాలను బయటపెట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆధారాలను సైతం పోలీసులకు ఇచ్చింది. ఇందులో భాగంగానే లావణ్య కేసులో రాజ్ తరుణ్ గా ఎ 1 గా ఏ 2 గా మాల్వి మల్హోత్ర a3 గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు. లావణ్య చెప్తుంది ఏంటి

 అంటే 2010లో రాజ్ తనకి తన ప్రేమ విషయం చెప్పాడు అని.. ఆ తర్వాత 2014లో వాళ్ళిద్దరికీ రహస్యంగా పెళ్లి అయింది అని.. అంతేకాదు రాజ్ తరుణ్ అన్ని విధాలుగా తనని వాడుకున్నాడు అని.. తన కుటుంబం కి అన్ని విధాలుగా అండగా ఉన్నాడు అని వాపోతోంది. అంతేకాదు ఇప్పటివరకు తన దగ్గర నుండి 70 లక్షల వరకు గుంజాడు  అని అంటోంది. ఆయన 15 కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇల్లులు మార్చామని కూడా లావణ్య చెబుతోంది. అంతేకాదు రాజ్‌తరుణ్‌, మాల్వి కలిసి నన్ను డ్రగ్స్‌ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపిస్తోంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దేవుళ్లలో

 శివుడు మనుషుల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం మొదలు కార్ వెనుక స్టిక్కర్ దాకా ఆయన మీద చాలా ప్రేమ ఉందని అన్నారు. ఇప్పుడు కూడా ఆయనను కలిసి ఆయనకు రాజ్ తరుణ్ నన్ను ప్రేమించి నమ్మించి మోసం చేశాడని ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలని అనుకుంటున్నానని ఆమె అన్నారు. పవన్ కి కూడా రెండు మూడు పెళ్లిళ్లు అయ్యాయి కానీ వాళ్ళని పవన్ గౌరవంగా, భాద్యతగానే చూసుకుని ఉంటారు. కానీ రాజ్ తరుణ్ అలా కాదు నాకు , పిల్లలకు కనీసం తిండి తినడానికి కూడా డబ్బు ఇవ్వడం లేదని లావణ్య పేర్కొంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: