టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ చేసిన అర్జున్ రెడ్డి సినిమా ఇప్పటికీ మర్చిపోలేరు. ఇప్పటికీ సినిమా టీవీల్లో వస్తుంటే టీవీలకు అతుక్కు పోతుంటారు సినీ ఆడియన్స్. అంతలా అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ కి ఫేమ్ తెచ్చి పెట్టింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించిన శాలిని పాండే అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాతోనే తనకి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తో పాటు మహానటి సినిమాలో సైతం సమంతతో కలిసి నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా

 ఉంది. శాలినీ పాండే రణవీర్ సింగ్ జంటగా ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల మహారాజ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ తన కెరీర్ ప్రారంభించినప్పుడు బాడీ షేమింగ్‌కు గురయ్యానని వెల్లడించింది. తన మాజీ మేనేజర్ కూడా తన అమాయక స్వభావాన్ని సద్వినియోగం చేసుకున్నారని షాకింగ్ విషయం తెలిపింది. `అప్పట్లో నేను నిజంగా బాడీ షేమ్ ని ఎదుర్కొన్నాను. అలాగే నేను కొత్త .. సౌత్ లో ఉన్నందున నాకు భాష అర్థం కాలేదు. ఆ సమయంలో నా నిర్వాహకులు  నా

 అమాయకత్వాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించారు` అని షాలిని అన్నారు.  అంతేకాదు ముంబైకి వచ్చేసరికి ఎవరూ తెలియదు. ఎక్కడికీ వెళ్లలేదు. నా ఇద్దరు స్నేహితులు నగరంలో నివసిస్తున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వారు ఉండే చోట ఉండలేకపోయింది. దీంతో షాలిని అబ్బాయిలతో చోటు(రూమ్ స్పేస్) పంచుకోవాల్సి వచ్చింది. తరువాత ఒక ఇంటర్వ్యూలో ఆ అబ్బాయిలు చివరికి తన కుటుంబంగా మారారని ఆమె వెల్లడించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: