పెళ్లి వేడుకలకు వెళ్తే ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకేసారి ఫోటోకి స్టిల్ ఇవ్వాలి. లేదా పెయిర్ ఇద్దరు కలిసి అయినా ఫోటోలు దిగాలి. సినీ తారలంతా తమ సతీమణులతో పెళ్లికి వెళ్లగా అక్కడ అలానే ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఐతే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఫోటోలో మాత్రం ఐశ్వర్య రాయ్ మిస్ అయ్యింది. ఒక్క ఐశ్వర్య మాత్రమే కాదు అభిషేక్ కూతురు ఆరాధ్య కూడా మిస్ అయ్యింది.
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇలా అందరు ఒకసారి ఫోటో దిగారు. ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ ఇంకా తన కూతురు ఆరాధ్య ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. కొన్నాళ్లుగా అభిషేక్, ఐశ్వర్యా విడిపోతారన్న వాదనలు వినిపించగా అవన్ని గాలి వార్తలే అని కొట్టిపారేశారు. కానీ అంబాని పెళ్లిలో అమితాబ్ ఫ్యామిలీకి దూరంగా ఐశ్వర్య కనిపించడం.. విడివిడగా ఫోటోలు దిగడం ఇవన్నీ వారి మధ్య డిస్టన్స్ వచ్చిందని అర్ధమవుతుంది. మరి అభిషేక్ ఐశ్వర్య నిజంగానే విడిపోయి ఉంటున్నారా లేదా వారి మధ్య ఏం జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది. పెళ్లికి వచ్చిన వారికి ఐశ్వర్య సెపరేట్ గా ఫోటో దిగడం గురించి అందరు మాట్లాడుకునేలా చేసింది. ఇక మీడియాలో ఐతే ఈ న్యూస్ స్పెషల్ టాపిక్ గా మారింది.