లోక నాయకుడు కమలహాసన్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు టు సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు టు తెరకెక్కించారు. అయితే అప్పట్లో విడుదలైన భారతీయుడు సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్పై రత్నం నిర్మించిన ఈ సినిమాలో మనీషా కోయిరాలా ఊర్మిళ సుకన్య తదితరులు కీలకపాత్రలో కనిపించారు. అప్పట్లో 15 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమాకి 50 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి .

దాదాపుగా 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనికి సీక్వెల్ వచ్చింది. కమలహాసన్ ప్రధాని పాత్రలో వచ్చిన ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదల అయింది. అలాగే హిందీలో కూడా జూలై 12న విడుదల అయింది. ఇందులో భాగంగానే ఇప్పుడు చాలామంది భారతీయుడు 2 సినిమా చూసే కంటే ముందు భారతీయుడు సినిమాని చూస్తున్నారు. భారతీయుడు ఫస్ట్‌ పార్ట్‌ కోసం చాలామంది ఓటీటీలో వెతికేస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది.

సోమవారం (జులై 15) భారతీయుడు ఫస్ట్ పార్ట్ ను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించంది. ఈ కల్ట్ కు భారీగా అభిమానులు ఉండటంతో మరోసారి ఓటీటీలో భారీ స్పందనను కూడగట్టుకొనే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు భారతీయుడు 2 చిత్రానికి పూర్తిగా మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది. ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్‌లో ఉందని, కానీ రెండో భాగం దాని దరిదాపుల్లోకి కూడా రాలేదని సినీ అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారతీయుడు 2 లో కమల్‌హాసన్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, నటుడు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, ప్రియా భవానీ శంకర్ తదితరులు నటించారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: