ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో పాటు ఇతర సినిమాలలో బిజీగా ఉన్నది. సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ తనని ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది అనసూయ. అనసూయ హీరోయిన్ సావిత్రి పాటకు బుల్లితెర పైన షోలో డాన్స్ వేయడం పైన ట్రోల్ చేశారు.. దీనిపైన యాంకర్ అనసూయ రియాక్ట్ అవుతూ తన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేస్తూ కౌంటర్ వేయడం జరిగింది.. హలో తేజ మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను నా శాంతి కోసం నేను స్పందించకూడదని అనుకుంటూ ఉంటాను .. కానీ స్పందించాల్సి వచ్చిందని తెలిపింది.
నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఛానల్ లో జరిగిన ఒక పండుగ కార్యక్రమానికి సరితం మహానటి సావిత్రమ్మకు నివాళులు అర్పించానని.. నా ప్రదర్శనను నేను చూసుకోవడం జరిగింది కానీ నెట్టింట చాలా అవమానకరమైన రీతిలో ట్రోల్ చేస్తున్నారని తెలిపింది.. నేను న్యాయమైన గౌరవప్రదమైన విమర్శలకు సిద్ధంగా ఉంటాను కానీ మహానటి సావిత్రమ్మకు నివాళులు ఇస్తున్న సమయంలో ఉద్దేశించి ఇలా గౌరవ పరచడం బాగాలేదంటూ తెలియజేసింది.. మీరు నిజంగానే తీర్పు చెప్పాలనుకుంటే జి ఫైవ్ లో బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం అనే కార్యక్రమం ఉన్నది వాటిని చూసిన తర్వాత నా నటన నచ్చకపోతే మీరు ఏ విధంగా చేసిన ఓకే అంటే తెలిపింది.