తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలోని నటనకు గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం.  వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే చాలా రోజుల నుండి అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ , అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి త్రివిక్రమ్ , అల్లు అర్జున్ తో అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ ని చిత్రీకరించడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈయన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా ప్రభాస్ హీరోగా కల్కి మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. అలాంటి కథతోనే త్రివిక్రమ్ , అల్లు అర్జున్ తో మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబోలో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి , అలా వైకుంఠపురంలో అనే మూడు మూవీ లు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa