టాలీవుడ్ యువ నటుడు రామ్ పోటినేని ఆఖరుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఈయన ది వారియర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. రామ్మూవీ లో డాక్టర్ , పోలీస్ ఇలా రెండు విభిన్నమైన పాత్రలలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన మాస్ ఈమేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద మూవీ లో హీరో గా నటించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం రామ్ తనకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించిన ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ లో కావ్య దాపర్ హీరోయిన్ గా కనిపించబోతుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను ప్రేమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ వారు ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: