అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప మొదటి భాగంతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అనుకున్నాడు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. మరో నెల , రెండు నెలల్లో ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ పూర్తి కాగానే తమిళ దర్శకుడు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ చేయాలి అని అనుకున్నాడు.

ఇక అందులో భాగంగా అట్లీ నీ ప్రత్యేకంగా కలిసి స్టోరీ డిస్కషన్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఆల్మోస్ట్ వీరి కాంబోలో సినిమా సెట్ అయింది అనుకునే సమయానికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కాంబోలో మూవీ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దానితో అల్లు అర్జున్ "పుష్ప" మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ మూవీకి దర్శకుడిని సెట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఒక దర్శకుడితో అల్లు అర్జున్ మూవీ ఓకే చేసినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ , అల్లు అర్జున్ కు ఒక స్టోరీ వినిపించగా , అది బాగా నచ్చడంతో అల్లు అర్జున్ ఈ దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది ఎలా ఉంటే నెల్సన్ దిలీప్ కుమార్ ఆఖరుగా రజనీ కాంత్ హీరోగా రూపొందిన జైలర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa