టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి నిధి అగర్వాల్ , మాలవికా మోహన్ , రీద్ధీ కుమార్ లు ప్రభాస్ సరసన హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తూ ఉండగా , ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. హిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సంజయ్ దత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 250 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ కి అద్భుతమైన మార్కెట్ ఉంది. ఆయన మూవీకి 250 కోట్ల బడ్జెట్ అనేది పెద్ద విషయం ఏమీ కాదు. ఎటు పోతే సమస్య అంతా మారుతి వైపు నుండే వచ్చింది. మారుతి ఇప్పటి వరకు 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమాలను కూడా తెరకెక్కించలేదు. అలాంటి దర్శకుడు ఏకంగా 250 కోట్ల బడ్జెట్ తో రూపొందబోయే సినిమాను సరిగ్గా డీల్ చేయగలడా ... అలాగే ఇంత వరకు మారుతి చిన్న హీరోలతో , మీడియం రేంజ్ హీరోలతో మాత్రమే సినిమాలు చేశాడు.

ఒక్క సారిగా అద్భుతమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరో అయినటువంటి ప్రభాస్ లాంటి నటుడిని డీల్ చేయగలడా ... ఇలాంటి ఎన్నో అనుమానాలు ఇటు ప్రభాస్ అభిమానులలో , అటు మామూలు సినీ ప్రేమికులలో వస్తున్నాయి. మరి వీటన్నిటిని దాటుకొని మారుతి , ప్రభాస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటాడు అని కొంత మంది భావిస్తున్నారు. మరి మారుతి "రాజా సాబ్" మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: