బాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోయిన్ లలో కత్రినా కైఫ్ ఒకరు. ఈమె కెరియర్ బిగినింగ్లో తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించింది. ఈ బ్యూటీ , విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన మల్లీశ్వరి మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే ఈ మూవీ తో ఈమెకు మంచి గుర్తింపు కూడా తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన అల్లరి పిడుగు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే ఈ మూవీ తర్వాత ఈమె తెలుగులో ఒక సినిమాలో కూడా నటించలేదు. వరుసగా హిందీ సినిమాలలోని నటిస్తూ వస్తుంది. ఆఖరుగా ఈ నటి సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన టైగర్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు. ఏదేమైనా ఈ బ్యూటీ కి మాత్రం హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉంది. దానితో ఈమెకు భారీ మొత్తంలో రెమ్యూనిరేషన్ ఒక్కో సినిమాకు అందుతున్నట్లు తెలుస్తోంది. కత్రినా కైఫ్ కి ఒక్కో మూవీ కి ఏకంగా 15 నుండి 20 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే ఈమె స్టార్ హీరోలా రేంజ్ లో రెమ్యూనరేషన్ ను ఒక్కో మూవీ కి చార్జి చేస్తున్నట్లు , అయినప్పటికీ ఈమె సినిమాలలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం , ఈమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో నిర్మాతలు కూడా ఈమె అడిగినంత ఇచ్చి సినిమాలలో హీరోయిన్ గా సెట్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయంలోనే కత్రినా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: