ఈ మధ్యకాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో బాగా ఓపెన్ అయిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక తమ కెరియర్ గురించి అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా సెలబ్రిటీలు చెబుతున్న కొన్ని షాకింగ్ విషయాలు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతున్నాయి. కాగా ఇప్పుడు బుల్లితెర నటి శ్రీ సత్య కూడా ఇలాగే తన కెరీర్ గురించి పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.


 మిస్ విజయవాడ టైటిల్ గెలిచిన శ్రీ సత్య నటి కావాలని ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. నేను శైలజ అనే చిత్రంలో చిన్న రోల్ దక్కించుకుంది. తర్వాత తెలుగు బుల్లితెరపై  ముద్దమందారం, త్రినయిని వంటి సీరియల్స్ లో కీలక పాత్రలు పోషించింది. కొన్ని వెబ్ సిరీస్లలో కూడా నటించి మంచి ఫేమ్ సంపాదించింది. ఇక ఆ తర్వాత బిగ్బాస్ ఆరవ సీజన్లోకి వెళ్లి కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా దగ్గర అయింది. అయితే ఈ షో ద్వారా ఈమెకు నెగెటివిటీ తప్ప ఏమి రాలేదు అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ తర్వాత సినిమా ఆఫర్స్ వస్తాయని ఆశలు పెట్టుకుంటే.. అలా జరగలేదు. ప్రస్తుతం బుల్లితెరకే పరిమితమైంది ఈ అమ్మడు.


 అయితే ఇటీవల శ్రీ సత్య లేటెస్ట్ లుక్ చూసి కొంతమంది నేటిజన్స్ ఆశ్చర్యపోయారు. ఆమె ముఖంలో కొన్ని మార్పులు గమనించారు. శ్రీ సత్య పెదాలు గతానితో పోల్చి చూస్తే కాస్త భిన్నంగా కనిపించాయి. దీంతో ఇదే విషయంపై సోషల్ మీడియాలో ఆమెకు ప్రశ్నల వర్షం కురిపించారు నేటిజన్స్. అయితే ఇలాంటి ప్రశ్నలపై శ్రీ సత్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. పెదవులకు సర్జరీ చేయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. సినిమా అవకాశాల కోసమే శ్రీ సత్య సర్జరీ చేయించుకుందట. పెదాలు పెద్దగా కనిపిస్తే బాగుంటుందని ఆమె ఆలోచనట. స్నేహితులు కూడా సర్జరీ తర్వాత బాగున్నవని.. హీరోయిన్ల కనిపిస్తున్నావని ఇకపై తన దృష్టి మొత్తం సినిమాల మీదే ఉంది అంటూ శ్రీసత్య చెప్పుకొచ్చింది. ఇక ఢీ రియాలిటీ షో మానేసానని.. ప్రొడక్షన్ టీం తో ఎలాంటి ఇబ్బంది లేదని ఛానల్ తోనే ఇబ్బంది అంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది శ్రీ సత్య.

మరింత సమాచారం తెలుసుకోండి: