నాచురల్ స్టార్ నాని ఎప్పుడూ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఉంటాడు. ఎప్పుడు ఏ దర్శకుని కోసం ఎదురు చూస్తూ సమయాన్ని వృధా చేయకుండా కొత్త దర్శకుడు అయినా సరే టాలెంట్ ఉండి అతని దగ్గర మంచి కథ ఉంటే అతనితో మూవీ చేయడానికి రెడీ అవుతుంటాడు. ఇకపోతే ఈసారి మాత్రం నానికి వింత పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రస్తుతం నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో నాని చాలామంది దర్శకులను లైన్ లో నెక్స్ట్ మూవీలకు రెడీగా ఉంచుకున్నాడు. కాకపోతే ఆయన ప్లాన్స్ అన్ని బెడిసి కొట్టాయి.

సరిపోదా శనివారం సినిమా తర్వాత నాని, సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ మూవీ చేయాలి అనుకున్నాడు. కానీ ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనే కారణంతో క్యాన్సల్ అయినట్లు తెలుస్తోంది. బలగం సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నానిమూవీ ప్లాన్ చేశాడు. కానీ వేణు రెడీ చేసిన కథ దసరా మూవీ స్టోరీ కి దగ్గరగా ఉన్న కారణంగా నాని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక శేఖర్ కమ్ముల కూడా నాని తో ఈ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం శేఖర్ "కుబేర" సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఈ మూవీ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది.

దానితో నాని ఈ దర్శకుడితో కాకుండా వేరే దర్శకుడితో తదుపరి మూవీ చేయాలి అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే చాలా రోజుల క్రితమే శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ చివరలో నాని "హిట్ ది థర్డ్ కేస్" మూవీలో హీరోగా నటించబోతున్నట్లు చూపించారు. కానీ ఈ సినిమా స్టార్ట్ కావడానికి చాలా సమయం పడుతుంది అని మొదట వార్తలు వచ్చాయి. ఇకపోతే నాని "సరిపోదా శనివారం" మూవీ తర్వాత అనుకున్న సినిమాలలో రెండు క్యాన్సల్ కావడం , ఒకటి ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో హిట్ ది థర్డ్ కేస్ మూవీని నెక్స్ట్ లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా నలుగురి మధ్యలో ఇరుక్కున్న నాని ఫైనల్ గా శైలేష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: