సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా నేమ్ అండ్ ఫేమ్‌ సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకటి. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న అనుష్క.. టాలీవుడ్ లో చాలా మంది టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ తనకు ఎంతో ఇష్టమైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాత్రం నటించలేకపోయింది.కొన్ని కాంబినేషన్స్ వింటానికి చాలా ఇంట్రస్ట్ గా ఉంటాయి. కానీ అవి కార్యరూపం దాల్చవు. అలాంటి వాటిల్లో ఒకటి అనుష్క, ఎన్టీఆర్ కాంబినేషన్. వీరిద్దరు జంటగా ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకు ప్రత్యేకమైన కారణం ఏమి లేదు కానీ అలా సెట్ అవ్వలేదు అంతే. అయితే అనుష్క కు మాత్రం ఎన్టీఆర్ తో చెయ్యాలని ఉందిట. ఈ విషయం ఆమే చెప్పింది.తెలుగులో  స్టార్ హీరో గా ఎదిగి హిందిలోకి కూడా ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెపపాల్సిన పని లేదు.  ఈ హీరో చాలా మంది తెలుగు భామలతో జతకట్టాడు. కానీ ఒక అనుష్కతో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అనుష్క తో ఎన్టీఆర్ కాంబినేషన్ కు గతంలో కొందరు దర్శకులు ట్రై చేసారు. అనుష్క హవా నడుస్తున్న టైమ్ లో ఈ ప్రయత్నాలు జరిగాయని వినికిడి. అయితే వర్కవుట్ కాలేదు. ఇక అనుష్క మాత్రం ఎన్టీఆర్ తో చేయటానికి మక్కువ చూపించింది. ఆ విషయం ఆమె స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.  గతంలో ఓ టీవి ఛానెల్ కోసం సీనియర్ నటి జయప్రద ఆమెతో ఓ ఇంటర్వూ చేసారు.అందులో భాగంగా మీకు ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరితో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే తడుముకోకుండా ఎన్టీఆర్ తో చేయాలని ఉందని చెప్పుకొచ్చింది.

అయితే ఆ కాంబినేషన్ మాత్రం కార్య రూపం దాల్చలేదు.అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వచ్చేదుంది. కానీ లాస్ట్ మినిట్ లో మిస్సైంది.  ఆ సినిమా ఏమిటంటే, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమ దేవి సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.కానీ మూవీలోని పాత్రలను మాత్రం బాగా హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పోషించిన గోనగన్నారెడ్డి పాత్ర ఇప్పటికీ తెలుగు ప్రజలు మర్చిపోరు. అయితే ఈ పాత్రకు ముందుగా, గుణశేఖర్ జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకుందాం అనుకున్నాడట. కానీ ఎన్టీఆర్ అంతగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో అల్లు అర్జున్‌కు ఈ అవకాశం వచ్చిందని చెప్తారు. అలా అనుష్క, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఈ మూవీ మిస్సైంది.  అలాగే  ఈ కాంబినేషన్ లో మూడు సినిమాలు సెట్ అయినట్లే అయి తర్వాత మిస్సయ్యాయని తెలుస్తోంది.అభిమానులు ఎంతగా ఎదురుచూసినప్పటికీ వీరిద్దరి కాంబోలో సినిమా మాత్రం రాలేదు.ఇక ఇప్పుడు అనుష్క ...ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ అయ్యేందుకు అవకాసం లేదు.ఎన్టీఆర్‌, అనుష్క శెట్టి కాంబినేష‌న్ లో  మిస్ అయిన చిత్రం ఊస‌ర‌వెల్లి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా యాక్ట్ చేసింది. 2011లో ప్రపంచవ్యాప్తంగా 1,800 స్క్రీన్లలో విడుదలైన ఊస‌ర‌వెల్లి అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక‌పోయింది. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా తొలిత అనుష్క‌ ను అనుకున్నారు. ఆమెతో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌గా.. క్యారెక్ట‌ర్ న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్ల రిజెక్ట్ చేసింది. దాంతో త‌మ‌న్నాకు హీరోయిన్ ఛాన్స్ ద‌క్కింద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: