టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఒక సినిమాతోనే ఫుల్ ట్రేస్ తెచ్చుకున్నారు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకుని..ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఒకటి రెండు చిత్రాల్లో మెరిసి ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. అందులో గ్రేసి సింగ్ ఒకరు. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు. కానీ నాగార్జున నటించిన సంతోషం మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మూవీ పేరు చెప్పగానే అందం, అమాయకత్వం కలిసిన ఓ రూపం అడియన కళ్ళ ముందుకు వస్తుంది. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో సంతోషం ఒకటి.


క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో శ్రియా శరణ్, గ్రేసి సింగ్ హీరోయిన్లుగా నటించగా..ప్రభుదేవ్, విశ్వనాధ్, పృథ్వి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నాగార్జున, గ్రేసి సింగ్ కెమిస్ట్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన "దేవుడే దిగివచ్చానా.. తాజ్ మహల్ నాకిచ్చిన.." అనే పాట చాలా ఫేమస్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దీనితో ఈ మూవీ తర్వాత తెలుగులో ఆ డ్యూటీకి ఆఫర్స్ వస్తాయి అనుకున్నారు అంతా. కానీ అలా రాలేదు.. సంతోషం సినిమా తర్వాత మోహన్ బాబు, శ్రీకాంత్ కలిసి నటించిన తప్పుచేసి పప్పు కూడా సినిమాలో నటించింది.


ఇక తర్వాత మరో మూవీ చేయలేదు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిలం, మలయాళం, పంజాబీ చిత్రాల్లో మెరిసిన గ్రేసి సింగ్..ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ఇక హిందీలో అమీర్ ఖాన్ సరసన గ్రేసి సింగ్ నటించిన లాగాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. ఈ మూవీలో గ్రేసి నటనకు నార్త్ ఆడియన్స్ ముగ్దులయ్యారు. ఆ తర్వాత గంగాజల్, మున్నా బాయ్ ఎంబీబీఎస్ చిత్రాల్లో నటించింది. చివరిసారిగా 2015 లో ఓ పంజాబీ సినిమాలో కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: