దుమ్ములేపిన డబుల్ ఇస్మార్ట్ రైట్స్? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?  స్టార్ హీరో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఇక ఇప్పుడీక మూవీకి డబుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వెల్ వస్తోంది. మొదటి సినిమా మంచి హిట్ ఇచ్చిన నమ్మకంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను హనుమాన్ నిర్మాతలు భారీ మొత్తానికి దక్కించుకున్నారు.డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు కొన్నాళ్ల నుంచి అసలు హిట్ దక్కలేదు. పైగా లైగర్ సినిమా రూపంలో పెద్ద దెబ్బే పడింది. అయినా కానీ అతని నెక్ట్స్ మూవీ డబుల్ ఇస్మార్ట్ కు మాత్రం క్రేజ్ ఇంకా తగ్గలేదు. రామ్ పోతినేనితో కలిసి గతంలో పూరీ జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ సంచలన విజయం సాధించడంతో ఈ సినిమా సీక్వెల్ హక్కులను హనుమాన్ నిర్మాత ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఏకంగా రూ.54 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. హిందీ వెర్షన్ హక్కులు కాకుండా మిగతా భాషల హక్కుల కోసం ఇంత మొత్తం డబ్బు చెల్లిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. ఆగస్ట్ 15 వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. 


ఆ హాలిడే వీకెండ్ ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ ఖాయమన్న అంచనాల నేపథ్యంలో పెద్ద మొత్తం ఇవ్వడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మొత్తం కూడా రూ.60 కోట్లు కాగా.. ఇందులో రూ.6 కోట్లు రికవరబుల్ అడ్వాన్స్ ఇంకా అలాగే రూ.54 కోట్లు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ గా ఉంది.ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా నుంచి వచ్చిన మాస్ ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రెండో పాట మార్ ముంత చోడ్ చింత పాట రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ కు మరో నెల రోజులు కూడా లేకపోవడంతో మేకర్స్ ఇక పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర పోషించడంతో హిందీ బెల్ట్ లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. లైగర్ మూవీతో ఆర్థిక నష్టాలతోపాటు డైరెక్టర్ గానూ ఎదురు దెబ్బ తిన్న పూరి జగన్నాథ్ మరోసారి ఈ డబుల్ ఇస్మార్ట్ తన మునుపటి మార్క్ చూపించాలని భావిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: