తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోగా మారాడు.. కిరణ్ అబ్బవరం హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు పలు షార్ట్ ఫిలిమ్స్ చేశాడు.వాటిలో కిరణ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఇక ఆ తర్వాత హీరోగా మారి రాజావారు రాణిగారు అనే సినిమా చేశాడు. ఈ సినిమా అందమైన ప్రేమకథగా తెరకెక్కింది. ఈ మూవీలో తన నేచురల్ యాక్టింగ్ తో కిరణ్ ఆకట్టుకున్నాడు. ఆతర్వాత వరుసగా హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా రొటీన్ సినిమాలు చేస్తు ట్రోల్స్ కి గురయ్యాడు. ప్రస్తుతం కిరణ్  'క' అనే తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. 'క' ను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు.ఇక ఈ టీజర్ విడుదల సందర్భంగా మీడియా ప్రశ్నలకు హీరో , దర్శకుడు సమాధానం చెప్పారు. కాగా ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కిరణ్ అబ్బవరం శభాష్ అనిపించే సమాధానం చెప్పాడు. ప్రస్తుతం పెద్ద హీరోలే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మరికొంతమంది టాప్ స్టార్ హీరోలు మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి వారు పాన్ ఇండియా మూవీస్ చేయడం లేదు.. మీ స్థాయి హీరోలు, మీరు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్.? మీకు తెలుగులోనే పెద్దగా సక్సెస్ లేదు అని మీరే చెప్తున్నారు. 


ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్.? అని ప్రశ్నించారు. దానికి కిరణ్ చాలా మెచ్యూర్ గా సమాధానం ఇచ్చారు.కిరణ్ మాట్లాడుతూ " పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా చేయాలనుకుంటే చేస్తారు సార్..అయితే ఆయన ఇంట్రెస్ట్ లేకో ఏమో చేయడం లేదు. ఇక ఇక్కడ స్థాయి అనేది నాది కాదు.. కంటెంట్ ది.. కంటెంటే స్థాయి.. కంటెంట్ బాగుంటే సినిమాని జనాలు తప్పకుండా చూస్తారు. మంజుమెల్ బాయ్స్ అనే ఓ మలయాళం నుంచి వచ్చింది. మనదగ్గర కూడా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ హీరో పేరు ఎవరికైనా తెలుసా.? అలాగే కాంతార థీమ్ మనకు అంతకు ముందు పెద్దగా తెలియదు.. నా స్థాయి పెద్దదా.. చిన్నదా అన్నది సెకండ్ థింగ్. మనమిచ్చే కంటెంట్ కు ఆ స్థాయి ఉన్నదా అన్నదే మ్యాటర్. కంటెంట్ బాగుంటే  అందరూ సినిమాను ఎక్కడికో తీసుకెళ్తారు. 'క' అనే కంటెంట్ పై నాకు బాగా నమ్మకం ఉంది అందుకే వేరే భాషల్లోకి వెళ్దాం అనుకున్నాం అని కిరణ్ అబ్బవరం అన్నారు. దాంతో కిరణ్ అబ్బవరంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. శబాష్ కిరణ్ అబ్బవరం..! అంటూ ట్రోల్ చేసిన వారే ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: