రెండు దశాబ్ధాల క్రితం దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సౌందర్య నటించిన సినిమాలు ఇప్పటికీ అప్పుడప్పుడు ఛానల్స్ లో ప్రసారం అవుతున్నప్పుడు వాటిని ఈతరం ప్రేక్షకులు కూడ బాగా చూస్తూ ఉంటారు. 1990 - 2000ల సంవత్సరాల మధ్య అప్పటి టాప్ హీరోలు అందరితోనూ సౌందర్య నటించడమే కాకుండా అనేక బ్లాక్ బష్టర్ హిట్స్ ఆమె కెరియర్ ను తారా స్థాయికి తీసుకు వెళ్ళింది.


‘మనవరాలి పెళ్ళి’ అన్న మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సౌందర్య ఆతరువాత ‘అమ్మోరు’ ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ మూవీలతో ఆమె కెరియర్ ఒక్కసారిగా స్పీడ్ అందుకుంది. ఆతరువాత ఆమె ఒక్క క్షణం తీరిక లేకుండా సంవత్సరానికి కనీసం 8 సినిమాలు చేస్తూ తెలుగు తమిళ కన్నడ మళయాళ హిందీ రంగలతో పాటు ఆమె హవా చాటింది.   ఆ రోజులలోనే  ఆమె పారితోషికం కోటి రూపాయలు తీసుకుంది  అన్న  ప్రచారం   అప్పట్లో  జరిగింది టాప్ హీరోయిన్ గా ఆమె కెరియర్ కొనసాగుతున్న రోజులలోనే ఆమె పెళ్ళి చేసుకుంది.


అయితే అనుకోకుండా ఎన్నికల ప్రచారానికి వెళుతూ ఆమె ఒక హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణించే సమయానికి ఆమె వయస్సు 27 సంవత్సరాలు మాత్రమే. అప్పట్లోనే ఆమె పారితోషికం టాప్ హీరోల పరితోషికంతో సమానంగా ఉండేది. ఆమె చనిపోయేనాటికి ఆమె ఆస్థుల విలువ 100 కోట్లు అని అంటారు. తన సంపాదన అంత స్థిరాస్తుల పై ఆమె పెట్టడంతో ఆమె చనిపోయి 20 సంవత్సరాలు దాటి పోతున్న నేటి పరిస్తులలో ఇప్పుడు విలువలు పెరిగి ఆమె ఆస్తి 1000 కోట్ల స్థాయికి చేరుకుందని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఆస్తికి వారసులుగా ఆమె తల్లి ఆమె భర్త కొనసాగుతున్నట్లు కన్నడ మీడియా వార్తలు రాస్తోంది. ఇప్పుడు ఆమె ఆస్తులకు సంబంధించినఈవార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజెన్స్ ఈవార్తను అత్యంత ఆశక్తితో చదువుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: