మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి నిజంగానే ఆ అరుదైన గౌరవం దక్కబోతోందా.. ఆ స్టార్ హీరోలతో దక్కిన గౌరవం రామ్ చరణ్ కూడా తన ఖాతాలో వేసుకోబోతున్నారా.. ఇంతకీ రామ్ చరణ్ లండన్ ప్రయాణం వెనుక ఉన్న మతలబ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం  గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ని పూర్తిచేసుకుని త్వరలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోయే సినిమాలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ మధ్యనే అనంత్ అంబానీ పెళ్లికి సతీమణితో కలిసి వెళ్లారు. ఈ పెళ్లి తర్వాత రామ్ చరణ్ లండన్ కి వెళ్ళగా ఉపాసన మాత్రం తిరిగి హైదరాబాద్ కి వచ్చేసింది. అయితే రామ్ చరణ్ లండన్ ప్రయాణం వెనుక చాలామంది ఏదో మతలబ్ ఉంది అని ఆయన గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. 

అయితే తాజాగా టాలీవుడ్ మీడియా నుండి మెగా ఫ్యాన్స్ అందరు ఎగిరి గంతేసే న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. అదేంటంటే ప్రభాస్, అల్లు అర్జున్,మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు దక్కిన గౌరవం రామ్ చరణ్ కి కూడా దక్కబోతుందట. ఇంతకీ ఆ గౌరవం ఏంటయ్యా అంటే ...లండన్ లోని ప్రముఖ మ్యూజియం అయినటువంటి మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ కి సంబంధించిన మైనపు బొమ్మను పెడుతున్నారట. అవును ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..రామ్ చరణ్ తన మైనపు విగ్రహం కోసం కొలతలను ఇవ్వడం కోసకే లండన్ కి వెళ్లారని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు మైనపు విగ్రహంతో పాటు ప్రభాస్ బాహుబలి గెటప్ లో ఉన్న మైనపు విగ్రహం మేడం టుస్సాడ్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు.

అలాగే ఈ మ్యూజియంలో అల్లు అర్జున్ పుష్ప గెటప్ లో ఉన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఫాలోయింగ్ ఎక్కువ అవ్వడంతో ఆయనకి సంబంధించిన మైనపు విగ్రహాన్ని కూడా మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టాలని నిర్ణయించుకున్నారట.ఇక ఈయన ఒక్క విగ్రహమే కాదు ఈయనతోపాటు తన పెట్ డాగ్ రైమ్ ని ఎత్తుకొని ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారట. అందుకే రామ్ చరణ్ తన భార్యని హైదరాబాద్ కి పంపించి తన పెట్ డాగ్ రైమ్ తో కలిసి లండన్ వెళ్లారని తెలుస్తోంది. ఇక ఈ వైరల్ అయ్యే రూమర్ లో ఎంత నిజం ఉంది అనేది ముందు ముందు తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: