కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్దార్. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వస్తున్నారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా ఆడియెన్స్ క్యూరియాసిటీతో ఎదురుచూసే ఓ మూవీ సీక్వెల్ స్టార్ట్ అయ్యింది. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్దార్. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఈ చిత్రం. తాజాగా సర్దార్ 2 పూజా కార్యక్రమం జరిగింది.జూలై 15 నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగనున్నట్లు పేర్కొంది.తాజాగా క్రేజీ వార్తతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కార్తీ టీం. ఈ చిత్రంలో స్టార్ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్‌జే సూర్యకు స్వాగతం పలుకుతూ ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు మేకర్స్‌. షూటింగ్ కొనసాగుతుందని తెలియజేశారు. ముందుగా వచ్చిన వార్తల ప్రనకారం చెన్నైలో వేసిన భారీ సెట్‌లో సర్దార్‌ 2 షూటింగ్ కొనసాగుతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌.

సర్దార్‌ 2ను కథానుగుణంగా కజకిస్తాన్‌, అజర్‌బైజాన్‌, జార్జియాలో చిత్రీకరింయబోతున్నట్టు సమాచారం. ఈ మూవీలో అమిగోస్‌ ఫేం ఆషికా రంగనాథ్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌… కాగా ఈ వివరాలపై మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.సర్దార్ ఎండింగ్ లో నెక్స్ట్ మిషన్ కంబోడియాలో జరగబోతోందని దర్శకుడు చెప్పారు. అక్కడి నుంచే ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్  పని చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: