కోలీవుడ్ ఫైర్ బ్రాండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇక్కడ పలు సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు వరలక్ష్మి చాలా దగ్గర అయింది. ఆమె కంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పరచుకుంది. అందుకే తెలుగు నిర్మాతలు వారి వారి సినిమాల్లో ఆమె కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను  రచయితలతో రాయించుకుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన హనుమాన్ అనే సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించి మెప్పించారు.

ఇక అసలు విషయంలోకి వెళితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయినటు వంటి వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా పెళ్లి చేసుకుని వైవాహిక బంధం లోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తన భర్తతో ఎక్కడపడితే అక్కడ కెమెరాకు చిక్కుతోంది. వరలక్ష్మి ముంబైకి చెందిన నికోలాయ్ సచ్ దేవ్ అనే బిజినెస్ మాన్ ని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అయితే ఈ జంట అటు ముంబై లోను ఇటు తమిళనాడులోను చాలా చోట్ల కెమెరాకు చాలా క్లోజ్ గా చిక్కడంతో వీరి ప్రేమను నెటిజెన్లు రకరకాలుగా అభివర్ణిస్తున్నారు. వరలక్ష్మి తన భర్తని కొంగుని కట్టేసుకుంది అని కొందరు అంటే... వారి అన్యోన్యమైన జీవితాన్ని చూసి మరికొందరు పర్ఫెక్ట్ కపుల్స్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ గత కొన్నాళ్లుగా షూటింగులకు దూరంగా ఉంటుంది. ఆమె తాజాగా ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ కాలేదు. మరో ఆర్నెల్ల వరకు ఆమె పూర్తి సమయం తన భర్తతోనే గడపనుందని సమాచారం. గతంలో హీరో విశాల్ కి, వరలక్ష్మికి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందంటూ పుకార్లు వెలువెత్తున సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజా వివాహంతో వరలక్ష్మి శరత్ కుమార్ వాటన్నిటికీ చెక్ పెట్టినట్టు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: