రాజ్ తరుణ్,లావణ్య ల వ్యవహారంతో ఒక్కసారిగా మెయిన్ మీడియాలో,సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ మాల్వీ మల్హోత్రా.. రాజ్ తరుణ్ తో ఎఫైర్ పెట్టుకొని నన్ను రాజ్ తరుణ్ ని దూరం చేసింది అంటూ లావణ్య మాల్విపై కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఈ వ్యవహారంలో ఎన్నో విషయాలు బయటపడ్డాయి. అయితే తాజాగా మాల్వీ కి సంబంధించి ఓ షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే మాల్వీ ఓ నిర్మాతను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వాడుకొని ఆయన ఆస్తులన్నీ కాజేసిందట. మరి ఇంతకీ ఆ నిర్మాత ఎవరు..నిజంగానే మాల్వి అంత పని చేసిందా అనే సంగతి ఇప్పుడు చూద్దాం. 

లావణ్య ఆ మధ్యకాలంలో మాల్వీ క్యారెక్టర్ మంచిది కాదని,ఆమె తన మాజీ ప్రియుడిని మోసం చేసి, తనే చేతులు కట్ చేసుకుని ప్రియుడి పై కేసు పెట్టింది.  ఆమె మంచిది కాదు ఒకవేళ ఆమె క్యారెక్టర్ మంచిదైతే నేనే రాజ్ తరుణ్ ని ఆమెకి వదిలిపెట్టి పోయేదాన్ని. కానీ మాజీ ప్రియుడు విషయంలోనే అలా చేసింది రాజ్తరుణ్ ని ఏం చేస్తుందో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అయితే లావణ్య మాటలు నిజమే అనిపించేలా తాజాగా మాజీ ప్రియుడు ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి మాల్విపై కేసుపెట్టింది. నా కొడుకు యోగేష్ ని ప్రేమ పేరుతో మోసం చేసి వాడి ఆస్తులన్నీ కాజేసింది.

వాడి పై కేసు పెట్టి జైలుపాలు చేసింది అంటూ పోలీసులకు తెలియజేసింది. అంతేకాదు అప్పట్లో యోగేష్ తో ప్రేమలో ఉన్న సమయంలో మాట్లాడిన ఆడియో కాల్స్,వీడియో కాల్స్ కి సంబంధించిన సమాచారాన్ని కూడా పోలీసులకు ఇచ్చింది. అయితే గతంలో నిర్మాత యోగేష్ ని ప్రేమించిన కొన్ని కారణాల వల్ల బ్రేకప్ జరిగిందట. అయితే ఆ సమయంలో యోగేష్ తనపై కత్తితో అటాక్ చేసి చంపేయాలని చూసాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.అయితే ఈ విషయాన్ని మళ్లీ యోగేష్ తల్లి బయటకు తీసి మాల్వీ మల్హోత్రా పై తిరిగి కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ విషయం మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: