ఐకాన్‌  స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాడు . అల్లు అర్జున్ పుష్ప 1 సినిమాలో హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నాడు . మరి ఇప్పుడు పుష్ప 2 సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి . అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లోనే ఓ మ్యాజిక్ ఉంది . ఇప్పటివరకు ఈ ఇద్దరి జోడిలో వచ్చిన మూడు సినిమాలు జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం లో సినిమాలు సాధించిన విజయాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు .


ఇక అలా వైకుంఠపురం లో చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టెనర్ గా ఓ సెన్సేషన్ సృష్టించింది . ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అటు త్రివిక్రమ్ , ఇటు అల్లు అర్జున్ ఎదురుచూస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం .. అల్లు అర్జున్ పుష్ప-2 కంప్లీట్ అయినా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది . ఇందుకు సంబంధించిన కథ కూడా ఓకే అయిందట. అయితే ఈ సినిమా దసరా రోజు చిత్రీకరణ ప్రారంభిస్తారని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు .


దీనిని సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ గీత ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయని టాక్. ఇక అల్లు అర్జున్ నెల్సనతో ఓ చిత్రం, సందీప్ రెడ్డి వంగాతో మూవీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక అది ఏ మూవీలో పుష్ప 2 అయినా తరువాత తెలుస్తుంది. పుష్ప టు మూవీ ఎయిర్ రేంజ్ లో ఉంటుందో చూడాలి. రిలీజ్ డేట్ దగ్గరికి వస్తున్నా కొద్ది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్టును అందుకోగలదా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: