లేడీ పవర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యారు సాయి పల్లవి.. ప్రస్తుతం వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా గడిపేస్తుంది సాయి పల్లవి. మొన్నీమధ్య సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన ఈ న్యాచురల్ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలను చేస్తుంది. ప్రస్తుతం అక్కినేని హీరో నాగచైతన్యతో కలిసి ఓ పాన్ ఇండియా మూవీ చేస్తుంది. తండేల్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీతో పాటే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టనుంది సాయి పల్లవి. అక్కడ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న రామాయణం మూవీలో సీతమ్మ పాత్రలో కనిపించనుంది ఈ నేచురల్ బ్యూటీ. ఇటీవలే ఈ మూవీ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యి వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫొటోల్లో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించగా సీతగా సాయి పల్లవి అందంగా చూడముచ్చటగా కనిపించి మెప్పించింది.


ఇక ఇదిలా ఉంటే సాయి పల్లవికి ఓ టాలీవుడ్ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట.. ఆ హీరో అంటే సాయి పల్లవికి ఎంతో అభిమానం అంటే ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్నీ సాయి పల్లవి స్వయంగా చెప్పడం జరిగింది.. ఇక ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. సాయి పల్లవికి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమట. ముఖ్యంగా ఆయన నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. దాంతో చాలా మంది కూడా షాక్ అవుతున్నారు.సాయి పల్లవి ఈ జనరేషన్ అమ్మాయి అయ్యుండి.. ఏ అల్లు అర్జున్ పేరో లేక పవన్ కళ్యాణ్ పేరో.. లేదా ప్రభాస్ పేరో చెప్తుంది అనుకుంటే ఏకంగా మెగాస్టార్ పేరు చెప్పింది. అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అయితే సాయి పల్లవికి చిరంజీవి మూవీలో నటించే అవకాశం వచ్చిన కూడా ఆ ఛాన్స్ ను ఆమె వదులుకుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళాశంకర్ మూవీలో చిరంజీవి చెల్లిగా సాయి పల్లవిని సంప్రదించగా ఆమె చిరంజీవి అంత గొప్ప నటుడికి చెల్లెలుగా నటించలేను అని చెప్పిందట. తాను అంతగా అభిమానించే హీరోకి చెల్లిగా నటించడం చాలా కష్టం అని చెపింది సాయి పల్లవి.

మరింత సమాచారం తెలుసుకోండి: