ఇప్పుడు అంతా కూడా పాన్ ఇండియా మోజు ఎక్కువయ్యింది. పాన్ ఇండియా హిట్ కోసం బాలీవుడ్ హీరోయిన్లను దింపుతున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు… మృణాల్ ఠాగూర్ లాంటి బాలీవుడ్ బ్యూటీలు ఏకంగా రు. 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో  జాన్వీకపూర్ టైం కూడా బాగా నడుస్తోంది.శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ను చూసేయాలన్న ఆతృత తెలుగు ప్రేక్షకులకు మామూలుగా లేదు. ఈ క్రమంలోనే గత నాలుగేళ్ల నుంచి ఆమెను తెలుగు సినిమాల్లో నటింపజేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి.మొదట యంగ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో జాన్వీని తీసుకునేందుకు దర్శకుడు పూరి జగన్నాథ్ ఎన్నో రకాలుగా విశ్వప్రయత్నాలు చేశారు. అప్పట్లోనే ఆమె చెప్పిన రెమ్యూనరేషన్ రేటు విని పూరి జగన్నాథ్ షాక్ అయ్యి సైలెంట్ అయిపోయాడు.


కేవలం పూరి జగన్నాథ్ మాత్రమే కాదు … మరో ఒకరిద్దరు దర్శకులు కూడా జాన్వీ కపూర్ కోసం ట్రైల్స్ వేసి చేతులు కాల్చుకున్నారు. చివరకు దేవర సినిమా కోసం కొరటాల - ఎన్టీఆర్ ఎట్టకేలకు జాన్వీ కపూర్ ని ఒప్పించారు. ఇక ఆ తర్వాత రామ్‌చరణ్ - బుచ్చిబాబు సినిమా కూడా ఓకే అయ్యింది. చరణ్‌, బుచ్చిబాబు సినిమాకు బేరం ఏకంగా మూడున్నర కోట్లకు సెటిల్ అయ్యిందట. అయితే ఇప్పుడు ఆమె కొత్త రేటు ఏకంగా రు. 8 కోట్లు చెపుతోందట.అంటే బేరసారాలు రు. 8 కోట్ల నుంచి మొదలవుతాయి. ఇక అది ఎక్కడకు పోతుందో? ఎక్కడ ఆగుతుందో ? చూడాలి. ఇక ఇప్పుడు నాని సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కోసం నాని కొత్తవాడు కావడంతో పాటు.. నానికి జాన్వీ వల్ల పాన్ ఇండియా మార్కెట్ వస్తుందన్న లెక్కలు ఉండడంతో అదనంగా మరో రు. 50 లక్షలు లేదా కోటి రెమ్యునరేషన్ అడుగుతుందని కూడా చర్చ నడుస్తోంది. ఇక స్టాఫ్ ఖర్చులు, అవి ఇవి కలుపుకుంటే ఆమె రెమ్యునరేషన్ రు. 5 కోట్లు దాటేస్తుందని తెలుస్తుంది.జాన్వి కొత్త రేటు చూస్తే తెలుగు నిర్మాతలకు అయితే గుండెళ్లో రైళ్లే పరిగెట్టేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: