బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. నమస్తే లండన్, వెల్‌కమ్, పార్టనర్, రేస్, సింగ్ ఈజ్ కింగ్ ఇంకా ఏక్ థా టైగర్ వంటి హిందీ చిత్రాలలో నటించింది.ఆ సినిమా లు ఆమెకు హీరోయిన్ గా భారీ క్రేజ్ ను తీసుకుని వచ్చాయని చెప్పాలి. కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన ఈ ముద్దుగుమ్మ మల్లీశ్వరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి కూడా అడుగుపెట్టింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు రావడం తో తెలుగు వైపు మళ్ళీ కన్నెత్తి కూడా చూడలేదు. హిందీ లో మాత్రం కత్రినా బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాలలో నటించింది. ఆల్మోస్ట్ నెంబర్ వన్ స్థానం లో ఉన్నప్పుడే ఈ హాట్ బ్యూటీ బిటౌన్ హీరో విక్కీ కౌశల్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక చాలా నెలల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న కత్రినా తాజాగా 'మెర్రీ క్రిస్మస్' సినిమాలో కనిపించింది. 


ప్రస్తుతం కత్రినా కైఫ్ ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు దాకా తీసుకుంటోందట.అలాగే, కత్రినా కైఫ్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 78.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోషల్ మీడియాలో బ్రాండ్లు ఇంకా కంపెనీల గురించి యాడ్స్ పోస్ట్ చేస్తుంది. తన సోషల్ మీడియా లో వేసే ఒక్క ప్రకటన ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా రూ. 6 కోట్లకు పై మాటేనట. ఆ విధంగా ఇటు సినిమా లలో ఇంకా అటు యాడ్స్ తో కలిపి కోట్ల లలో సంపాదిస్తుంది కత్రిన కైఫ్ ఏదేమైనా సినిమా ఆఫర్లు లేకపోయినా, పెళ్లయ్యిన తర్వాత కూడా కత్రినా కైఫ్ ఈ రేంజ్ లో సంపాదించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక పోతే ఆమె ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 224 కోట్లు అని సమాచారం తెలుస్తుంది. హీరోయిన్ గా వచ్చి అన్ని కోట్ల రూపాయలు సంపాదించడం నిజంగా చాలా గ్రేట్. ఇక కొన్నాళ్ల నుంచి మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన కత్రినా.. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో భర్త విక్కీ కౌశల్‌తో కలిసి సందడి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: