శైలేష్‌ కొలను డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తూ క్రైం థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కించిన చిత్రం హిట్‌. ఈ ప్రాజెక్ట్‌ ప్రాంచైజీలో వచ్చిన హిట్‌ 2 కూడా మంచి వసూళ్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా ఈ సారి న్యాచురల్‌ స్టార్ నాని తో హిట్‌ 3 ఉండబోతుందని శైలేష్‌ కొలను ఇప్పటికే ప్రకటించేశాడు. చాలా రోజుల తర్వాత హిట్‌ కి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.ఇటీవలే శైలేష్ కొలను నానిని కలిసి స్కిప్ట్‌ వినిపించాడట. కథ విన్న నాని కొన్ని స్కిప్ట్‌లో కీలక మార్పులు చేయాలని సూచించినట్టు ఫిలింనగర్‌ సర్కిల్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన సైంధవ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఊహించని ఫ్లాప్‌ టాక్ మూటగట్టుకుంది. అద్భుతమైన స్కిప్ట్‌ సెన్స్‌ కలిగిన నాని ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాకు పనికొచ్చేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని సూచించినట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ప్రస్తుతానికి నెట్టింట ఈ వార్త హల్ చల్ చేస్తుంటే నాని టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ స్టార్ హీరో ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా షూటింగ్‌తో బిజీగాఉన్నాడు. ఈ చిత్రాన్ని వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు.నాని, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబోలో రానున్న 'హిట్ 3'సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీని పై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సివుంది.

నాని 31గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2024 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా..దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును డీవీవీ నిర్మిస్తోండగా.. కోలీవుడ్ స్టార్‌ యాక్టర్‌ ఎస్‌జే సూర్య  కీలక పాత్రలో నటిస్తున్నాడు.గ్యాంగ్ లీడర్ తర్వాత నాని- ప్రియాంకా మోహన్‌ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరక్కుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. అంటే సుందరానికి తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై క్యూరియాసిటీ అంచనాలు భారీగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: