ఇస్మార్ట్ శంకర్’ తరువాత రామ్ పూరీ జగన్నాథ్ తిరిగి కలిసి చేస్తున్న ‘డబల్ ఇస్మార్ట్’ మూవీ వీరిద్దరి కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. దీనితో ఈమూవీ విషయంలో పూరీ తన శైలికి భిన్నంగా చాల నెమ్మదిగా మూవీని పూర్తి చేశాడు. వచ్చేనెల ఆగష్టు 15న విడుదలకాబోతున్న మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈమూవీకి సంబంధించిన పాటలను విడుదల చేస్తూ ఈమూవీ పై అంచనాలు పెంచడానికి పూరీ గట్టిప్రయత్నాలు మొదలుపెట్టాడు.


పూరీ జగన్నాథ్ కు అత్యంత సన్నిహితుడైన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ట్యూన్ చేసిన పాటలు వింటూ ఉంటే తిరిగి ఈమూవీతో తాను మారిచిపోయిన మాస్ టాలెంట్ ను పూరీ మణిశర్మకు గుర్తు చేశాడా అని అనిపించడం సహజం. గతంలో అనేకమంది టాప్ హీరోలసినిమాలకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను ఇచ్చిన మణిశర్మ గత కొంతకాలంగా ఈనాటి తరం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా పాటలకు ట్యూన్స్ కట్టలేకపోతున్నాడు అని విమర్శలు చేస్తున్న వారికి ‘డబల్ ఇస్మార్ట్’ ద్వారా మణిశర్మ గట్టి సమాధానం ఇవ్వబోతున్నాడు.  


ఈసినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన టైటిల్ సాంగ్ ఇప్పటికే చార్ట్ బష్టర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా ఈసినిమాకు సంబంధించి విడుదల చేసిన రెండవ పాట మాస్ మసాలాతో ఉండటమే కాకుండా మధ్యలో వెరైటీ కంపోజింగ్ కనిపించింది.


ఈ సాంగ్ లో కెసిఆర్ సొంత గొంతుతో ఉన్న ఏం చేద్దామంటావ్ ఆడియోని వాడుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న పదాలను ఈపాటలో వాడటంతో ఈపాట కూడ సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. నాటు తెలంగాణ పదాలను జోడిస్తూ కాసర్ల శ్యామ్ వ్రాసిన సాహిత్యం రాహుల్ సిప్లిగంజ్ కీర్తన శర్మ గాత్రాలు కలవడంతో ఈపాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈమూవీ అంచనాలకు అనుగుణంగా హిట్ అయితే తిరిగి మళ్ళీ పూరీ జగన్నాథ్ హవా ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: