ఈ మధ్య కాలంలో కొన్ని పదాలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇక అలాంటి వాటిని పాటలలో కూడా ఉపయోగించుకుంటున్నారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినటువంటి కుర్చీని మడత పెట్టి అంటూ సాగే ఒక పదాన్ని సాంగ్ లో చేర్చారు. ఇక మొదట ఇది కాస్త వార్తల్లో నిలిచిన ఈ సాంగ్ చివరగా బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఇప్పటికే ఈ సాంగ్ కి యూట్యూబ్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఇలా స్టార్ హీరో , స్టార్ డైరెక్టర్ ఉన్న సినిమాలోనే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పదాన్ని పెట్టుకున్నారు. అలాగే ఆ పాట కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఈ రూట్ లోనే రామ్ పోతినేని , పూరి జగన్నాథ్ కూడా వెళుతున్నారు. ప్రస్తుతం రామ్ పోతినేని హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబల్ ఈస్మార్ట్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కావ్య దాపర్ హీరోయిన్ గా నటించగా ... మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పూరీ జగన్నాథ్ , ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. 

మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ బృందం ఓ పాటను విడుదల చేసింది. అందులో కేసీఆర్ ఒకానొక సందర్భంలో ఏం చేద్దాం అంటావు మరి అనే ఒక పదాన్ని వాడాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసిన సాంగ్ లో ఈ పదాన్ని వాడారు. దానితో ఈ సాంగ్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇలా స్టార్ డైరెక్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన పదాలను తమ సినిమా పాటల్లో పెడుతున్నారు. వాటికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: