హాట్ హాట్ అందాలతో విపరీతమైన ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మల్లో రంభ ఒకరు. స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ రంభ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు.సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రంభ. ఇంకా తన గ్లామర్ తో అప్పటి కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేశారు రంభ. చాలా మంది స్టార్ హీరోలు రంభ డేట్స్ కోసం ఎదురుచూసే స్థాయికి ఆమె పైకి ఎదిగారు. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ హాట్ బ్యూటీ. రంభ ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించింది రంభ. కేవలం హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించి హాట్ గా మెప్పించింది ఈ బ్యూటీ.జూనియర్ ఎన్టీఆర్ తో అయితే రెండు మూవీల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. జూనియర్ నటించిన నాగ, యమదొంగ సినిమాల్లో స్టెప్పులేసింది. ఇంకా అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు లోనూ స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు సినిమాలకు చాలా దూరంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నా కూడా రంభ అందం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 


అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఈ హాట్ బ్యూటీ. ఇదిలా ఉంటే గతంలో రంభ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ ఇంటర్వ్యూలో తన బలహీనత ఏంటో చెప్పింది. తనను ఎవరైనా తిడితే అస్సలు తట్టుకోలేదట ఈ అమ్మడు. వారి పై కక్ష తీర్చుకునే దాకా వదిలిపెట్టను అని తెలిపింది. ఇంకా రంభ మాట్లాడుతూ.. తన తండ్రి విషయంలో కూడా ఇలానే జరిగిందని తెలిపింది రంభ.. ఒకసారి తన తండ్రి ఎదో కోపంలో తనను తిడితే ఏకంగా ఆరు నెలలు ముప్పుతిప్పలు పెట్టాను అని తెలిపింది. ఆయనతో అసలు మాట్లాడలేదు అని తెలిపింది. ఒకసారి తన తండ్రి తనను ఎందుకో తిడితే.. ఉదయం నుంచి రాత్రి దాకా వెళ్లి మెట్ల కింద దాక్కున్నాను చెప్పింది. ఆతర్వాత ఆయన వచ్చి బ్రతిమిలాడితే బయటకు వచ్చి అన్నం తిన్నానని తెలిపింది. నా తప్పు ఉంటే వెంటనే క్షమాపణ చెప్తా.. అదే నా తప్పులేకుండా నన్ను ఎవరైనా ఏదైనా అంటే వారి పై కక్ష సాధించే దాకా వదిలిపెట్టను అని తెలిపింది రంభ.

మరింత సమాచారం తెలుసుకోండి: