ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా కే జి ఎఫ్ చాప్టర్ 1 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో ఒక్క సారిగా ఈ దర్శకుడికి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన తిరక్కెక్కించిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈ దర్శకుడి క్రేజ్ మరింతగా పెరిగింది. కొన్ని రోజుల క్రితమే ఈ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ పార్ట్ 1 సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ కూడా అద్భుతమైన విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా సలార్ పార్ట్ 2 మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే మరికొన్ని రోజుల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందబోయే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రేజ్ కలిగిన ఈ దర్శకుడికి ఒక హీరో అంటే చాలా ఇష్టం అట. అలాగే అతనితో ఒక సినిమా చేయాలని కోరికగా కూడా ఉందట. ఆ హీరో ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.  

ప్రశాంత్ నీల్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం అట. అలాగే ఆయనతో ఒక సినిమా చేయాలి అని కూడా ఈయనకు ఉందట. ఇక తాజాగా ప్రశాంత్ నిల్ మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టం అని , ఆయన సినిమాకు దర్శకత్వం వహించాలని ఉన్నట్లు తెలియజేసిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పార్ట్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ తో చిత్రీకరించే సినిమా స్టార్ట్ కాకముందే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: