బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈమధ్య సినిమాల విషయంలో దూకుడు తగ్గించింది. దానికి కారణం అమ్మడు కాస్త ఓల్డ్ అయిపోవడమే. పెళ్లి తర్వాత కామన్ గానే హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గుతాయి. అయినా సరే ఇప్పటికీ తన క్రేజ్ కు తగిన ఆఫర్లను సంపాదిస్తుంది అమ్మడు. ఐతే కత్రినా సినిమాల కన్నా సోషల్ మీడియా ద్వారా ఎక్కువ సంపాదిస్తుందని లేటెస్ట్ టాక్. అదేంటి అంటే ఇన్**స్టా**గ్రాం లో కత్రినాకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో కోట్లు సంపాదిస్తుందని తెలుస్తుంది.

కత్రినా కైఫ్ కు సోషల్ మీడియాలో దాదాపు 80.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు 8 కోట్ల పైన ఆమెను ఫాలో అవుతున్నారు. కత్రిన ఏదైనా పోస్ట్ పెడితే డైరెక్ట్ గా వారికి వెళ్తుంది. అందుకే బ్రాండ్ ప్రమోషన్స్ కి కత్రినాను ముందు ప్రిఫర్ చేస్తుంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందులోనూ సోషల్ మీడియాలో అమ్మడికి ఈ రేంజ్ ఫాలోవర్స్ ఉండటం వల్ల ఇలా ప్రమోషన్స్ ద్వారానే కత్రినా లక్షల్లో సంపాదిస్తుందని అంటున్నారు.

అందుకే ఈమధ్య సినిమాలు తగ్గించి ఇలా ఇంట్లో కూర్చుని అమ్మడు రెండు చేతులా సంపాదిస్తుందని అంటున్నారు. విక్కీ కౌశల్ ని పెళ్లాడిన కత్రినా కైఫ్ తన పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. అమ్మడు ఈమధ్య మెర్రీ క్రిస్మస్ అనే సినిమాలో నటించింది. మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టింది. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియా ప్రమోషన్స్ వేటికవే ప్రత్యేకంగా చేస్తూ కోట్లు ఖాతాలో వేసుకుంటుంది అమ్మడు. రీసెంట్ గా కత్రినా గర్భవతి అంటూ వచ్చిన వార్తలను విక్కీ కౌశల్ అలాంటిది ఏమి లేదని ఉంటే తానే వెళ్లడిస్తానని చెప్పాడు. తెలుగులో కూడా కత్రినా కైఫ్ సినిమాలు చేసిందని తెలిసిందే. బాలయ్య, వెంకటేష్ లతో అమ్మడు జత కట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: