టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లో 156వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం విషయంలో అయితే మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా షూటింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రాబోతోంది విశ్వంభర. ఈమధ్య కాలంలో చిరంజీవి ఫాంటసీ సినిమా చేయలేదు. ఆ లోటును భర్తీ చేస్తే రాబోతోంది ఈ చిత్రం. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారు.ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. రిచ్ ప్రొడక్షన్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రాబోతోంది. విశ్వంభర 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.తాజాగా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉండగా ఇప్పటికే మూడు పాటలు చిత్రీకరించారని, మరో రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్‌ ఉన్నట్టు సమాచారం. అందులో ఒకటి హీరో ఇంట్రడక్షన్ కాగా, మరొకటి స్పెషల్ సాంగ్‌. అలాగే క్లైమాక్స్‌ ఫైట్‌ కూడా చిత్రీకరించాల్సి ఉంది.

ఆగస్టు నెలాఖరులోగా షూటింగ్ మొత్తం పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్, ఎడిటింగ్ గ్రాఫిక్‌ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వీలయినంత త్వరగా సినిమాను పూర్తి చేసి.. ఇన్నోవేటివ్‌గా ప్రమోషన్స్‌ చేయనున్నారట. పద్దెనిమిదేళ్ల తర్వాత చిరంజీవికి జంటగా త్రిష నటిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆగష్టు 22న విశ్వంభర టీజర్ ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. కనీసం ఫస్ట్ గ్లింప్స్ అయిన ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. వశిష్ట మల్లిడి కూడా గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయాలని అనుకుంటున్నారు. సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువగా ఉండబోతోంది. దానికి కనీసం ఆరు నెలలైనా సమయం కావాలి. అందుకే ఒకటి, రెండు షెడ్యూల్స్ లో షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: