ఏపీ కి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ అసలు సినిమాలు చేయడమే చాలా గ్రేట్ అనే పరిస్థితి ఏర్పడింది. ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లో బిజీ అవ్వాలని చూస్తున్నాడు. అందుకే పవన్  సినిమాలను పూర్తి చేయలేకపోతున్నాడు.పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.అంతేకాదు హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా వస్తుందని స్పష్టం చేశారు. ఈ భారీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ నుంచి చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. సంగీత దిగ్గజం కీరవాణి బాణీలు కడుతున్నారు. బాలీవుడ్‌ స్టార్ యాక్టర్, యానిమల్ ఫేమ్ బాబీ దేవోల్‌ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఐతే సినిమాను నిర్మాతలు వారి సొంత లాభాల కోసం 2 భాగాలుగా చేస్తున్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కి ఇది ఒక ప్రాజెక్ట్ కిందే లెక్క గట్టి ఆయనకు రెమ్యునరేషన్ ఇస్తున్నారట.అంటే వీరమల్లు రెండు భాగాలకు కలిసి పవన్ పోర్షన్స్ అంతా పూర్తి చేస్తున్నారట. అలా ఐతే ఈ సినిమా ద్వారా పవర్ స్టార్ కి లాస్ అన్నట్టే లెక్క. అందుకే వీరమల్లు పవన్ కి సంబందించిన సీన్స్ అన్ని పూర్తి చేసి సినిమాను రెండు ముక్కలుగా చేసి ఒక భాగం ఈ ఇయర్ ఎండింగ్ లో మరో పార్ట్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు.హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ గురించి జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.పవన్ నటిస్తున్న తొలి పీరియాడికల్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.‘హరిహర వీరమల్లు’తో పాటు సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల షూటింగ్స్‌ను కూడా పెండింగ్‌లో పెట్టారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: