ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. ఈసారి ఏ సెలబ్రెటీలు వస్తారు? ఎలాంటి టాస్కులు పెడతారు? అని ఆడియన్స్ చాలా ఎక్సైట్ మెంట్ తో ఉన్నారు. అయితే ఇప్పుడు వీరికి షాప్ ఇచ్చే ఒక న్యూస్ వైరల్ గా మారింది. బిగ్‌బాస్‌లోకి రావడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదని, నష్టమే ఎక్కువగా ఉంటుందని  చాలామంది సెలబ్రిటీలు ఒక నిర్ణయానికి వచ్చారనేది ఆ న్యూస్ సారాంశం.

కొందరు సెలబ్రిటీలు డబ్బు కోసం హౌస్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. మరి కొంతమంది పాపులారిటీ పెంచుకుని సినిమా అవకాశాలు దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే గత ఏడు సీజన్లను పరిశీలిస్తే బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ఏ సెలబ్రిటీ కూడా సినిమాల్లో క్లిక్ అవ్వలేదు. దివి, అభిజిత్, శ్రీముఖి, సోహెల్, వరుణ్ సందేశ్, వితిక, పునర్నవి ఇలాంటి ఎందరో సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు. దీనివల్ల వారి పాపులారిటీ కొంచెం పెరిగిందేమో కానీ నెగెటివిటీ కూడా అంతే స్థాయిలో వచ్చింది. ఇలా సినిమాల్లో వాళ్ళకి అవకాశాలు పెద్దగా రాలేదు.

ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో కూడా చెప్పలేని పరిస్థితి. బిగ్ బాస్ కు ముందు అడపాదడపా వాళ్లు కనిపించేవారు. ప్రస్తుతం అలాంటి అవకాశాలు కూడా వారిని వరించడం లేదు. పైగా వీరిపై ఉన్న నెగెటివిటీ అనేది పెరిగే అలానే ఉండిపోయింది. చాలా రోజుల హౌస్ లో వీరి ప్రవర్తనను గమనించారు కాబట్టి వారిలోని లోపాలను తెలుసుకోగలిగారు. ఉదాహరణకు ముక్కు అవినాష్ చాలా ఎక్స్ట్రాలు చేసి ఇంతకు ముందున్న మంచి పేరు చెడగొట్టుకున్నాడు. ఇకపోతే సీజన్ 8లో బర్రెలక్క, నటి హేమ, కుమారీ ఆంటీ, బంచిక్ బబ్లు, సురేఖావాణి, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్, అమృత ప్రణయ్, రీతు చౌదరి, విష్ణుప్రియ, అంబటి రాయుడు, వేణు స్వామితో పాటు మరికొందరు కంటెస్టెంట్స్ పాటిస్పేట్ చేయనున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: