ప్రముఖ జ్యోతిష్యుడు కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తరచూ సినీ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటాడు ఈయన. నటీనటుల పెళ్లి సమయంలో ముందుగానే వాళ్ళ జాతకాలను చెబుతూ ట్రోల్స్ కి గురవుతూ ఉంటాడు. అంతేకదు  ఈయన చెప్పినవన్నీ నిజం అవుతాయని చాలా మంది నమ్ముతుంటారు. సినిమా వాళ్లు కూడా వేణు స్వామితో ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటుంటారు. సమంత నాగ చైతన్య విడాకుల గురించి ముందే

 చెప్పి పాపులర్ అయ్యారు. అలాగే స్టార్ హీరోల ఆరోగ్యం పై కూడా కామెంట్స్ చేశారు వేణు స్వామి. అలాగే ప్రభాస్ ఇక పై హిట్స్ అందుకోలేడు అని చెప్పారు. కానీ ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు. ఇక వేణు స్వామి రష్మిక మందన్న, డింపుల్ హయతి, నిధి అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి అషు రెడ్డి, ఇనాయ సుల్తానా లాంటి బుల్లితెర నటుల వరకు అందరికి స్పెషల్ పూజలు చేస్తూ ఉంటారు.  ముఖ్యంగా సమంత - నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని బిగ్‌బాంగ్ పేల్చిన సంగతి తెలిసిందే. అలా ఈయన చెప్పిన తర్వాత వీరు నిజంగానే విడాకులు తీసుకున్నారు. దీంతో వేణు స్వామి జాతకాలు నిజమవుతాయని

 సెలబ్రిటీలు సైతం అతని వద్దకు వెళ్లి జాతకాలు చెప్పించుకున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి మాట్లాడుతూ.. రకుల్ ప్రీత్ సింగ్‌కి పెళ్లి చేసుకున్నాక ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని నేను ఇప్పటికే చెప్పాను. మరోసారి ఈ విషయం గురించి చెబుతున్నాను. ఈమె మరో 6 మంత్స్‌లో విడాకులు తీసుకుంటుంది. ఇప్పటికే పెళ్లయ్యాక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది. ఈ క్రమంలో భర్త జాకీ భగ్నాని పూజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అందులో పని చేసే వాళ్ళకి శాలరీ ఇవ్వడం లేదని చెప్పడం, అలాగే ఆ బ్యానర్ పై చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం, రీసెంట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం వంటివి జరిగాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: