బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదగాల్సిన యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద స్థితి లో ఆత్మహత్య చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆయన ఆత్మహత్యపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యామిలీ వాళ్ళు ఆయన లవర్ రియా చక్రవర్తి పై అనుమానం వ్యక్తం చేశారు. అయితే రియా చక్రవర్తి తన అకౌంట్లోకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకౌంట్ నుండి 15 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించుకుందని సుశాంత్ తండ్రి కే.కే.సింగ్ ఆరోపించారు. ఈ విషయం లో మనీలాండరింగ్ కింద రియా చక్రవర్తి పై కేసు నమోదు అయింది. 

అంతే కాకుండా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి మాదక ద్రవ్యాలు కూడా ఇచ్చారు అనే ఆరోపణ లో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు ఇద్దరు జైల్లో చాలా రోజులు ఉన్నారు. ఇక సుశాంత్ రాజ్ పుత్ మరణించిన సమయంలో రియా చక్రవర్తి నే అందరూ ప్రధాన దోషి గా చూసారు. అయితే తాజాగా రియా చక్రవర్తి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. చాలమంది నాపై ఎన్నో రకాలుగా ప్రచారం చేస్తున్నారు. నిజం ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎన్నో భారాలను మోస్తున్నాను.

అలాగే నేను చేతబడి చేశాను అని వార్త కూడా ప్రచారం జరిగింది. కానీ నేను ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు.  ప్రస్తుతం నేను మోటివేషనల్ స్పీచ్ లు ఇస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నాను. నాకు అదే ప్రధాన ఆధారం అంటూ చెప్పింది. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోయిన సమయంలో కొంతమంది బాలీవుడ్ జనాలు రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పై చేతబడి చేయించి మరణించేలా చేసింది అనే ప్రచారం చేశారు. ఇక ఈ ప్రచారంపై తాజాగా రియా చక్రవర్తి క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: