అల్లు అర్జున్.. కొద్ది నెలల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పుష్ప-2 సినిమా పోస్ట్ పోన్ అంటూ చాలా రోజుల పాటు అనేక రకాల వార్తలు వచ్చాయి.షూటింగ్ చాలా మిగిలి ఉండడం వల్ల వాయిదా వేస్తారని టాక్ వచ్చింది. అనుకున్నట్లే ఆగస్టు నుంచి డిసెంబర్ కు పోస్ట్ పోన్ అయింది ఈ మూవీ. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బన్నీ నంద్యాల వెళ్లడం, నంద్యాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవికి సపోర్ట్ చెయ్యడం మెగా ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. బాగా వ్యతిరేకించారు. కనీసం పవన్ గెలిచాక మెగా సెలబ్రేషన్స్ కు కూడా రాకపోవడం, నిర్మాతలందరు కలిసి పవన్ వద్దకు అల్లు అరవింద్ వెళ్లినా బన్నీ ఇప్పటి వరకు పవన్ ని కలిసినట్లు కనిపించలేదు. రీసెంట్ గా పుష్ప-2 సినిమా షూటింగ్ ఆగిపోయిందని, సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందని పెద్ద చర్చ సాగింది. పుష్ప సినిమా సీక్వెల్ షూటింగ్ జరుగుతుండగానే.. బన్నీ ట్రిమ్ చేసుకున్న లుక్ బాగా వైరల్ అవ్వగా రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. 


ఆ తర్వాత బన్నీ టీమ్ వాటిని పూర్తిగా కొట్టిపారేయగా.. రీసెంట్ గా రీసెంట్ గా బన్నీ వాసు కూడా పుష్ప-2 మూవీ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.ఇప్పుడు బన్నీ పై పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ ఫేమ్ సాయిబాబా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. పవన్ కు వీరాభిమాని అయిన ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అల్లు అర్జున్‌ తో సినిమా చేసే ఆఫర్ వచ్చినా కానీ తాను అంగీకరించనని ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిబాబా తెలిపారు.కొన్ని రోజుల క్రితం నాగబాబు పెట్టిన పోస్ట్ అక్షరాలా నిజమని అన్నాడు.పుష్ప-2 మూవీలో నాకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అల్లు అర్జున్ బిహేవియర్ నచ్చదు. ఒకవేళ ఆఫర్ ఇచ్చినా కానీ నేను అల్లు అర్జున్‌ తో పని చేయలేను. డై హార్డ్ అభిమానులని తన్నడం కొట్టడం చూశాను. అతని ఫ్యాన్స్ నన్ను తిట్టినా పర్లేదు. పుష్ప-2 డేట్ ఇంకా ఛేంజ్ చేసుకుంటూ ఉండాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు.మొన్న ఒక ఆరు నెలలు షూటింగ్ వాయిదా పడింది. మళ్లీ ఆరు నెలలు వాయిదా పడుతుందని బన్నీకు చాలా ఇగో ఉందని ఆ ఇగోను తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సాయిబాబా.

మరింత సమాచారం తెలుసుకోండి: