టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ అందుకుంటుంది. ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ తో కలిసి చేసిన ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచినప్పటికీ ఇటీవల పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో ఒక కీలక అతిథి పాత్రలో కనిపించింది మృనాల్ . కల్కి సినిమాలో దివ్య అనే పాత్రలో నటించింది మృణాల్. మూవీ తొలి పది

 నిమిషాల్లోనే ఈ పాత్ర కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన సంగతి తెలిసిందే. గతంలో డైరెక్టర్ హను రాఘవుపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాను కూడా ఇదే బ్యానర్ నిర్మించింది. ఇక ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.  అయితే కల్కి సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడు బాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ క్రేజీ హీరో వరుణ్ ధావన్‌ సినిమాలో నటించే అవకాశం దక్కింది. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా

 తీసుకుని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్‌ గా ఎంపిక అవ్వడంతో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తి అయ్యిందట.  బాలీవుడ్‌ లో వరుణ్‌ ధావన్ సినిమాలో నటించే అవకాశం రావడం అనేది ఖచ్చితంగా పెద్ద అవకాశం. ఆ సినిమా హిట్ అయితే కచ్చితంగా మృణాల్ కి హిందీలో మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు రావచ్చు. మరో వైపు తెలుగు మరియు తమిళంలో ఈ అమ్మడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలా ప్రస్తుతం ఎటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఆఫర్స్ తో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: