కృష్ణ వంశీ.. తెలుగు సినిమా పరిశ్రమ లో పరిచయం అక్కర్లేని పేరు.  విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నారు. క్రియేటివ్ దర్శకుడి గా పేరు సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వం లో గులాబీ, సింధూరం, ఖ‌డ్గం, అంతఃపురం వంటి సినిమాలు తెరకెక్కాయి. ఇండస్ట్రీకి హిట్స్ అందుకున్నాయి.కృష్ణవంశీ ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించారు. గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత కృష్ణ వంశీ కొంచం గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు రంగమార్తాండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు కృష్ణ వంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.చిరంజీవి గారి తో అప్పట్లో ఒక సినిమా చేయాలనీ చూశాను.ఆయన కూడా చేయడానికి రెడీ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. చిరంజీవిగారితో సినిమా అంటే ఆషామాషీ కాదు. అన్ని కుదరాలి. ఆ సినిమా ఆయన తప్ప మరెవ్వరూ చేయలేరు అనేలా ఉండాలి. అలాంటి కథ దొరికినప్పుడు తప్పకుండా చేస్తా అన్నారు కృష్ణవంశీ.చిరంజీవిని అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తుంటారు కృష్ణవంశీ..” చిరంజీవి గారితో నాకు మంచి అనుబంధం, చనువు వుంది అన్నారు.మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా ప్లాన్ చేయమని ఒక నెటిజన్ కోరారు. అన్నయ్యతో సినిమా అంటే ఆయనే డిసైడ్ చేయాలి. నాకు కూడా ఆయనతో మూవీ చేయాలి అంటే ఎప్పటికీ ఇష్టమే అని సమాధానమిచ్చారు. ఇటీవల విడుదల అయిన సినిమాలలో కిరణ్ కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన లాపతా లేడీస్ తనకు బాగా నచ్చిందని తెలిపారు.దర్శకుడు కృష్ణవంశీ x లో అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికరా సమాధానాలిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: