హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులని బాగా కట్టుకున్నాడు. ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప మూవీ లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాలలో సేవలందించినందుకు గాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స కొందరు ప్రముఖులకు, సినీ రంగాలలోని తారలకు గోల్డెన్ విసాలు అందజేస్తున్న విషయం విశేషం. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు ఈ వీసా అందుకున్నారు.


తాజాగా మరొక టాలీవుడ్ హీరో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా అందుకున్నారు. అతను ఎవరో కాదు ప్రస్తుతం మా అధ్యక్షులు మంచు విష్ణు. ఆర్ట్స్ మరియు కల్పర్ కు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తిస్తూ అబుదాబిలోని సంస్కృతిక మరియు పర్యాటక శాఖ ప్రతిష్టాత్మక uae గోల్డెన్ వీసాను మంచు విష్ణుకు మంజూరు చేసింది. ఈ మేరకు ఆ వీసాను మంచు విష్ణుకు అందజేశారు సాదరు అధికారు. uae గోల్డెన్ వీసా అందుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు విష్ణు. ఈ పిసాతో దుబాయ్ లో పదేళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివాసముండచ్చు.


2019 నుంచి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి దుబాయ్ ప్రభుత్వం ఇలా గోల్డ్ వీసాతో సత్కరిస్తుంది. కాగా మంచు విష్ణు కంటే ముందుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. వీరితో పాటు అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ విశిష్ట గౌరవం దక్కించుకున్నారు. అట్లు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ గోల్డెన్ వీసా పొందారు. ఇప్పుడు మంచు గోల్డెన్ వీసా సెలబ్రిటీల జాబితాలో చేరారు. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి "కన్నప్ప" లో నటిస్తూ నిర్వహిస్తున్నాడు. డిసెంబర్లో కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: