రెండు సాలిడ్ హిట్ సినిమాల తర్వాత నాచురల్ స్టార్ నాని "సరిపోదా శనివారం"  అనే సినిమా చేస్తున్న విషయం తెలిసింది. వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్  అంతా  ముగించుకొని రిలీజ్ కు  సిద్ధంగా ఉంది సినిమా. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని నటించబోయే తదుపరి సినిమాలపై సినీ సర్కిల్స్ లో తెగ చర్చలు

 జరుగుతున్నాయి. గతేడాది  నాని  నటించిన దసరా సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో నానికి మరింత క్రేజ్ పెరిగిపోయింది. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడు నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమాకు ఏకంగా రూ. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి నిర్మాతలు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన దసరా సినిమాను రూ.60 కోట్ల బడ్జెట్ తో

 తెరకెక్కించారు నిర్మాతలు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించి భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో మరోసారి వీళ్ళిద్దరి కాంబో రిపీట్ కావడంతో ఈసారి ఏకంగా రూ.100 కోట్లతో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. నాని కెరీర్  లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా. దాంతో అభిమానులంతా ఈ సినిమా ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29 న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: