గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇందులో రామ్ ద్వి పాత్రలో నటిస్తున్నారు. శంకర్  తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో అంజలి, కీయారా అద్వానీ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రాగా చరణ్ కు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి కాగా. ఇంకా ఈ సినిమా రెండు వారాలకు  సంబంధించిన మిగతా సీన్స్ బ్యాలెన్స్ గా ఉంది. ఈ సినిమా కోసం సినీ లవర్స్ అంతా ఎంతో

 ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట భారీ విజయాన్ని అందుకుంటుంది. దీంతో అభిమానులకు ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే ఈ పాట తర్వాత అభిమానులంతా ఈ సినిమా నుంచి మిగతా అప్డేట్స్ మెయిన్ గా చెప్పాలంటే టీజర్, గ్లింప్స్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే.... ఈ పాన్ ఇండియా సినిమా నుంచి ఆగస్టు 15న మేకర్స్ టీజర్ ను విడుదల

 చేయనున్నట్లుగా తెలుస్తోంది. దానితో ఈ వార్త విన్న అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మెగా ఫాన్స్ కి చిరు బర్త్ డే కంటే ఓ వారం ముందే బ్లాస్టింగ్ ట్రీట్ రానుంది అని చెప్పాలి.ఇదిలా ఉండగా ఈ చిత్రానికి తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత రామ్ చరణ్ గేమ్ ఛెంజర్ చిత్రంతో తేర మీదకి వస్తుండడం తో ప్రేక్షకులలో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: