ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్  వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన పాన్ ఇండియా కల్కి 2898 ఎడి సినిమా థియేటర్లలో దుమ్ము రేపుతోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ఇందులో దిశా పటాని, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, వంటి బాలీవుడ్ స్టార్ నటినటులు ఇందులో ముఖ్యమైన పాత్రలు చేశారు. కాగా సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో

 దూసుకుపోతున్న ఈ సినిమా హిందీ వర్షంతో పాటుగా యూకే లో కూడా అత్యంత భారీ వస్సులను రాబడుతోంది. ఇక ఈ చిత్రం రూ.1,411,494  డాలర్ల కి పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూటర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇక పోతే ఈ పాన్ ఇండియా మూవీ  ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది. కాగా బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శోభన, మాళవిక నారాయణ్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ పలువురు కీలక పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణ అద్భుతమైన సంగీతం అందించారు.

ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటున్న చూడాలి మరి. ఇది కాసేపు పక్కన పెడితే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దానితోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్. కాగా స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మరింత సమయం పట్టడంతో ప్రభాస్ ఫౌజీ సినిమాను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. ఇక స్పీరిట్ సినిమాను 2025లో ప్రారంభించాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫౌజీ సినిమాలో అందాల భామ మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ విషయాలపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: