సలార్, కల్కి సినిమాలతో మంచి విజయాలతో దూసుకుపోతున్నారు హీరో ప్రభాస్.. ఈ రెండు సినిమాలు సీక్వెల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో అనే విషయానికి పక్కన పెడితే ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా జరుపుకుంటోంది. అలాగే డైరెక్టర్ హనురాగవపూడి డైరెక్షన్లో ఒక పీరియాడిక్ సినిమా చేయబోతున్నారు ప్రభాస్.. అంతకంటే ముందుగానే రాజా సాబ్ సినిమా ని పూర్తి చేసే పనిలో పడ్డారట ప్రభాస్




పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పైన ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రాజా సాబ్ సినిమా రూ .250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తూ  ఉన్నారు. ఇందులో ప్రభాస్ పారితోషకమే 125 కోట్లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బడ్జెట్లో సగం వరకు ప్రభాస్ తీసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ప్రభాస్ కేవలం 85 కోట్ల నుంచి 90 కోట్ల రూపాయల మధ్యలోనే తీసుకోబోతున్నాడని సమాచారం.. గతంలో కూడా ఆదిపురుష్ సినిమా సమయంలో  ఆ సినిమా రైట్స్ ని పీపుల్ మీడియా వారికి ఇప్పించారు.


సినిమా వల్ల 35 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందట. అందుకనే ప్రభాస్ తన పారితోషకాన్ని తగ్గించుకొని మరి రాజా సాబ్ సినిమాని చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అడ్వాన్స్ కింద 75 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది మరో 10 కోట్ల రూపాయలు ఇటీవలే ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తన సినిమాలకు సంబంధించిన నిర్మాతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ప్రభాస్ ఇండస్ట్రీలో అంతటి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగానే ఉంటారు. కల్కి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఈ సినిమాలో కర్ణుడు పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: