ప్రస్తుతం మన టాలీవుడ్ ఎనర్జిటిక్ సీనియర్ హీరో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మిస్టర్ బచ్చన్” అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా హిందీ చిత్రం రైడ్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో పూర్తవుతుండగా లేటెస్ట్ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే దానిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది.ప్యూర్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.సీనియర్ నటుడు జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, సితార్ సాంగ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా.. తాజాగా మేకర్స్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇండిపెండెన్స్ డే సందర్భంగా 2024లో విడుదల అయ్యే సినిమాల జాబితా ఈసారి చాలా ఎక్కువగా ఉంది. చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వం వహించిన 'తంగలాన్', ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కలయికలో 'డబుల్ ఇస్మార్ట్', మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటించిన 'ఆయ్', రానా దగ్గుబాటి సమర్పణలో నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి ప్రధాన తారాగణంగా రూపొందిన '35 - చిన్న కథ కాదు' సినిమాలు ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ సినిమాలతో పాటు రవితేజ 'మిస్టర్ బచ్చన్' కూడా అదే తేదీన వస్తోంది.మరి రవితేజపై ఒక అవుట్ అండ్ అవుట్ వైట్ కాస్ట్యూమ్ లో స్టైలిష్ లుక్ తో రిలీజ్ డేట్ పోస్టర్ ని వదిలారు. దీనితో ఫ్యాన్స్ కి ఈ ఏడాదిలోనే మరో సాలిడ్ ట్రీట్ రాబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: